చండీఘడ్: యూపీలో ఇవాళ ముక్తార్ అన్సారీ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఘాజిపూర్లోని తన పూర్వీకుల శ్మశానవాటికలోనే అన్సారీకి తుది వీడ్కోలు పలికారు. అయితే పరారీలో ఉన్న ముక్తార్ అన్సారీ భార్య, లేడీ డాన్ అఫ్సా అన్సారీ(Afsa Ansari) కోసం పోలీసులు ఆ సమయంలో ఎదురుచూశారు. యూపీ పోలీసుల లేడీ డాన్ లిస్టులో అఫ్సా అన్సారీ ఉన్నది. అయితే శశ్మానవాటిక వద్దకు ఆమె రాలేదు. కాలీ బాగ్ శ్మశానవాటికలో ముక్తార్ అన్సారీ మృతదేహాన్ని ఖననం చేశారు. తల్లి సమాధి పక్కనే అతన్ని పూడ్చారు. భారీ సంఖ్యలో శ్మశానవాటికకు ప్రజలు చేరుకున్నారు. అన్సారీ సోదరుడు, కుమారుడు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
పలు కేసుల్లో అఫ్సా వాంటెడ్లో ఉన్నది. గ్యాంగ్స్టర్ యాక్టు కింద కూడా ఆమెపై కేసులు ఉన్నాయి. దాదాపు ఏడాది నుంచి ఆమె పరారీలో ఉన్నది. గృహిణిగా చెప్పుకునే ఆమెపై మూడు కీలకమైన కేసులు ఉన్నాయి. దాంట్లో రెండు భూకబ్జా కేసులు కూడా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. 2022, జనవరి 31వ తేదీన గ్యాంగ్స్టర్ చట్టం కింద దక్షిణ్ తోలా పోలీసు స్టేషన్లో ఆమెపై కేసు నమోదు అయ్యింది.
గ్యాంగ్స్టర్ నుంచి పొలిటీషియన్గా మారి, ఏకంగా ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసి, గురువారం రాత్రి గుండెపోటుతో ముఖ్తార్ అన్సారీ మరణించాడు. ఇవాళ ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు ప్రశాంతంగా ముగిశాయి.