తిరువనంతపురం: నిరుడు మహా కుంభమేళా సమయంలో సోషల్ మీడియాలో సంచలనంగా మారిన మోనాలిసా భోస్లే కేరళలో ప్రేమ వివాహం చేసుకుంది. కుంభమేళాలో పూసలమ్ముకుంటున్న ఈ బ్యూటీ వీడియో వైరల్ కావడంతో తర్వాత ఆమెకు సినిమా ఆఫర్లు వచ్చి నటి, మోడల్గా మారింది. ఇండోర్కు చెందిన మోనాలిసా తన ప్రియుడు ఫర్మాన్ఖాన్ను బుధవారం అరుమనార్లోని శ్రీ నైనార్ దేవ ఆలయంలో వివాహం చేసుకుంది.
కేరళ మంత్రి వీ పవన్ కుట్టీ, రాజ్యసభ ఎంపీ ఏఏ రహీమ్, ఇతర రాజకీయ నేతలు, నగర ప్రముఖులు వారి వివాహానికి హాజరయ్యారు. వీరిద్దరికి ఏడాదిన్నర క్రితం ఫేస్బుక్లో పరిచయం అయ్యి తర్వాత ప్రేమగా మారింది. అయితే ఇరువురి మతాలు వేరు కావడంతో ఇరు కుటుంబాల వారు వారి వివాహానికి అంగీకరించ లేదు. తాను చూపించిన వ్యక్తినే పెండ్లి చేసుకోవాలంటూ మోనాలిసా తండ్రి జై సింగ్ భోస్లే ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో ఇంట్లో తెలియకుండా వివాహం చేసుకున్న మోనాలిసా దంపతులు పెండ్లి అయిన తర్వాత తమకు రక్షణ కల్పించాలంటూ కేరళ పోలీసులను ఆశ్రయించారు. ఇది అసలైన కేరళ స్టోరీ అని, కేరళలోనే తాము సురక్షితంగా ఉంటామని ఆ జంట నమ్మిందని ఎంపీ ఎంఏ రహీమ్ తెలిపారు.