ఘజియాబాద్, ఏప్రిల్ 20: ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆప్ మాజీ నేతలు కుమార్ విశ్వాస్, అల్కా లాంబాపై పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 28న విచారణకు హాజరుకావాలని ఇరువురు నేతల ఇండ్లకు వెళ్లి పోలీసులు నోటీసులు అందజేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్పై కుమార్ విశ్వాస తీవ్ర ఆరోపణలు చేశారు. ఖలిస్థాన్ వేర్పాటువాదుల మద్దతు తీసుకునేందుకు కేజ్రీవాల్ సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. తాను పంజాబ్కు సీఎం అయినా అవుతా లేదా స్వతంత్ర దేశానికి (ఖలిస్థాన్) తొలి ప్రధాని అయినా అవుతానని కేజ్రీవాల్ ఒక రోజు తన చెప్పాడని విశ్వాస్ ఆరోపణలు చేశారు. విశ్వాస్ వ్యాఖ్యలకు లాంబా మద్దతు పలికారు.