హరిద్వార్: ఈ నెల 8న హెలిక్యాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ దంపతుల చితాభస్మాన్ని ( Bipin Rawat Ashes ) వారి కుమార్తెలు క్రితిక, తరిణి నిమిజ్జనం చేశారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ పుణ్యక్షేత్రం వద్ద శ్రాద్ధ కర్మలు నిర్వహించి చితాభస్మాన్ని గంగానదిలో కలిపేశారు. కుమార్తెలిద్దరూ తమ తల్లిదండ్రుల చితాభస్మాలుంచిన పాత్రలను పుష్పాలతో నింపి విడివిడిగా నీళ్లలో జారవిడిచారు.
జనరల్ బిపిన్ రావత్ దంపతులు తమిళనాడులోని కూనూరు వద్ద నీలగిరి కొండల్లో జరిగిన హెలిక్యాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. హెలిక్యాప్టర్ సూలూరు నుంచి వెల్లింగ్టన్కు వెళ్తుండగా కూనూరు సమీపంలో కుప్పకూలింంది. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్ దంపతులతోపాటు మరో 11 మంది మరణించారు. ఒకరు తీవ్రంగా కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.