కోజీకోడ్, ఏప్రిల్ 12: సౌదీ అరేబియాలో మరణశిక్ష పడిన వ్యక్తిని రక్షించేందుకు కేరళ ప్రజలు ఏకంగా రూ.34 కోట్లను సమీకరించారు. కోజికోడ్కు చెందిన అబ్దుల్ రహీమ్ 2006లో సౌదీలో ఓ బాలుడిని హత్య చేశాడనే ఆరోపణపై గల్ఫ్ దేశంలో 18 ఏండ్లుగా జైలు జీవితం గడుపుతున్నాడు. అయితే నష్టపరిహారం చెల్లిస్తే క్షమాభిక్షకు బాలుడి కుటుంబం అంగీకరించింది.
దీంతో రహీమ్ను ఎలాగైనా రక్షించి విడుదల చేయించటానికి ఏర్పడిన యాక్షన్ కమిటీ ఐదు రోజుల క్రితం దాకా చాలా తక్కువ మొత్తమే సేకరించగల్గింది. ఈ విషయం బాగా ప్రచారం కావటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేరళీయులు అనూహ్యంగా స్పందించారని శుక్రవారం నిర్వాహకులు తెలిపారు.