భువనేశ్వర్, సెప్టెంబర్ 13: బ్రిటన్ రాజవంశం ఆధీనంలో ఉన్న కోహినూర్ వజ్రం ఒడిశాలోని పూరీ జగన్నాథుడిదేనని ఓ సంస్థ పేర్కొంటున్నది.
ఆ వజ్రాన్ని యూకే నుంచి పూరీ ఆలయానికి తీసుకొచ్చేందుకు మధ్యవర్తిత్వం నడపాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరింది. కాగా, క్వీన్ ఎలిజబెత్-2 మృతితో బ్రిటన్ రాజుగా చార్లెస్ సింహాసనాన్ని అధిష్టించారు. దీంతో నిబంధనల ప్రకారం 105 క్యారెట్ల కొహినూర్ వజ్రం చార్లెస్ సతీమణి క్వీన్ కెమెల్లాకు చెందనున్నది.