ముంబై: పీహెచ్డీకి రిజిస్ట్రేషన్ చేసుకొన్న ఏడాదికే బీజేపీ నేత కొడుకుకు డాక్టరేట్ పట్టా అందజేయటంపై వివాదం రేగింది. మహారాష్ట్ర బీజేపీ నేత కిరిట్ సోమయ్య కొడుకు నీల్ సోమయ్య 2021 జూన్లో యూనివర్సిటీ ఆఫ్ ముంబైలో పీహెచ్డీ(ఫిలాసఫీ)కి రిజిస్ట్రేషన్ చేసుకొన్నాడు.
అతడు 2022 ఆగస్టులో థీసిస్ సమర్పించినట్టు పేర్కొని సెప్టెంబర్లో డాక్టరేట్ ప్రదానం చేశారు. వాస్తవానికి పీహెచ్డీ పూర్తి చేయటానికి నాలుగైదు ఏండ్లు పడుతుంది. దీంతో నీల్ వ్యవహారంపై విద్యార్థి సంఘాలు భగ్గమంటున్నాయి. నిబంధనల ఉల్లంఘనపై ధ్వజమెత్తాయి.