Mallikarjuna Kharge : నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) పై కాంగ్రెస్ అధ్యక్షుడు (Congress President) మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) లేఖ రాశారు. ప్రస్తుత లోక్సభ స్థానాల సంఖ్య 543 మరో 25 ఏళ్లపాటు ఇలాగే ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్రాల వారీగా ఉన్న లోక్సభ స్థానాల్లోనూ ఎలాంటి మార్పులు చేయొద్దని సూచించారు. డీలిమిటేషన్ దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావంచూపే అత్యంత కీలకమైన విషయమని తెలిపారు.
దీనిపై నిర్ణయం తీసుకునే ముందు అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాల అభిప్రాయాలకూ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. 2029 లోక్సభ ఎన్నికల నుంచే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని వెంటనే అమల్లోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. జనాభా నియంత్రణకు కృషి చేసిన రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా రాజ్యాంగపరమైన రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. డీలిమిటేషన్పై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా విస్తృత రాజకీయ సంప్రదింపులు జరపాలన్నారు.