చండీగఢ్: భారత్లో మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న ఖలిస్థాన్ నేత, కెనడాలోని ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్సింగ్ నిజ్జర్ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. కెనడా సర్రే సిటీలో బ్రిటిష్ కొ లంబియా ప్రావిన్స్లో గురునానక్ సిక్కు గురుద్వారా వద్ద సాయుధులైన ఇద్దరు వ్యక్తులు అతడిని హతమార్చారు.
కారు లో ఆదివారం బుల్లెట్ గాయాలతో పడి ఉ న్న ఆయన మృతదేహాన్ని కనుగొన్నారు. పంజాబ్లోని జలంధర్కు చెందిన నిజ్జర్ కెనడాలో ఉంటూ ఖలిస్థాన్ వాదాన్ని ప్రచా రం చేయడమే కాక, భారత్లో టెర్రరిస్టు కార్యకలాపాలకు నేతృత్వం వహిస్తున్నాడు.