తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. వరుసగా మూడో రోజు కూడా 20 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా యాక్టివ్ కేసులు 1.54 లక్షలకు పెరిగింది. గత రెండు నెలలుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు రికార్డవుతున్నాయి. అయితే బుధవారం నుంచి గురువారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 22,064 కరోనా కేసులు, 128 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 33,49,365కు, మొత్తం మరణాల సంఖ్య 16,585కు పెరిగింది.
మరోవైపు గత 24 గంటల్లో 16,649 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 31,77,453కు చేరుకున్నదని, ప్రస్తుతం 1,54,820 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశంలో కరోనా హాట్స్పాట్గా కేరళ కొనసాగుతున్నది.