తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత నెల రోజులుగా నిత్యం పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 15,637 కరోనా కేసులు, 128 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 31,03,310కు, మొత్తం మరణాల సంఖ్య 14,938కు పెరిగింది.
మరోవైపు గత 24 గంటల్లో 12,974 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 29,70,175కు చేరుకున్నదని, ప్రస్తుతం 1,17,708 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో పాజిటివ్ రేటు 10.03 శాతంగా వెల్లడించింది. కాగా, దేశంలో కరోనా హాట్ స్పాట్గా కేరళ కొనసాగుతున్నది.