Kerala Nurse | న్యూఢిల్లీ: యూఏఈలో కేరళ నర్స్ మను మోహనన్కు జాక్పాట్ తగిలింది. లాటరీలో ఆయన రూ.70 కోట్లు గెలుచుకున్నారు. లైవ్ టీవీ షోలో జరిగిన బిగ్ టికెట్ రాఫెల్ డ్రాలో హోస్ట్ ఆయనను పిలిచి, “మీరు 3 కోట్ల దిర్హామ్స్ విజేత” అని చెప్పారు. మోహనన్ షాక్కి గురై, నిజమేనా? అని మూడుసార్లు టికెట్ నంబరును చెప్పించుకున్నారు.
‘రెండు టికెట్లు కొంటే ఒకటి ఉచితం’ స్కీమ్లో ఆయన ఈ టికెట్ను గత నెలలో కొన్నారు. మోహనన్ మాట్లాడుతూ, తాను, తన స్నేహితులు ఐదేళ్ల నుంచి లాటరీలో బహుమతి కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. తాను ఏడేళ్ల నుంచి బహ్రెయిన్లో నర్స్గా పని చేస్తున్నానని తెలిపారు.