తిరువనంతపురం, అక్టోబర్ 23: కేరళలోని 9 యూనివర్సిటీల వైస్ చాన్సలర్లు వెంటనే రాజీనామా చేయాలని ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆదేశించారు. సోమవారం ఉదయం 11.30 లోపు రాజీనామా పత్రాలు తనకు అందాలని స్పష్టం చేశారు.
కేరళలోని ఏపీజే అబ్దుల్ కలాం టెక్నాలాజీకల్ యూనివర్సిటీ వీసీ నియామకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ రాజీనామా లేఖలు కోరారు. దీంతో ప్రభుత్వం, గవర్నర్ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. వర్సిటీ వీసీ నియామకానికి సెర్చ్ కమిటీ ముగ్గురి పేర్లు సూచించాలని, కానీ అబ్దుల్ కలాం వర్సిటీ వీసీ విషయంలో ఇలా జరుగలేదని ఇటీవల సుప్రీం పేర్కొన్నది.