ప్రకటించిన తమిళనాడు సీఎం స్టాలిన్
చెన్నై, ఆగస్టు 24: డీఎంకే మాజీ అధ్యక్షుడు, మాజీ సీఎం కరుణానిధి స్మారకాన్ని రూ.39 కోట్లతో నిర్మించనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంగళవారం ప్రకటించారు. ‘ఆధునిక తమిళనాడు’ నిర్మాణ కృషికి గుర్తింపుగా స్మారకం నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. 2018 ఆగస్టు 7న ఆయన మరణించిన తర్వాత అంత్యక్రియలు జరిపిన ప్రసిద్ధ మెరీనా బీచ్ కామరాజర్ సాలైలో 2.21 ఎకరాల స్థలంలో కలైంజర్ మెమోరియల్ నిర్మించనున్నట్టు స్టాలిన్ అసెంబ్లీలో ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్ష అన్నాడీఎంకే కూడా స్వాగతించింది.