బెంగళూరు, అక్టోబర్ 21: నకిలీ ఐడీ కార్డులను తయారుచేస్తున్న ముఠా సభ్యుల్ని కర్ణాటక పోలీసులు పట్టుకున్నారు. నకిలీ ఓటర్, ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర ముఖ్యమైన పత్రాల్ని తయారుచేయటంలో ఆరితేరిన మౌనేష్ కుమార్, భగత్, రాఘవేంద్రలను అదుపులోకి తీసుకున్నట్టు బెంగళూరు క్రైంబ్రాంచ్ పోలీసులు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిందితుల్లో ఒకడైన మౌనేష్ కుమార్కు కర్ణాటక మంత్రి బీఎస్ సురేశాతో సంబంధాలున్నట్టు ఆరోపణలు వెలువడ్డాయి. ముఠాను వెనుకుండి నడిపిస్తున్న మౌనేష్ కుమార్, రాష్ట్రమంత్రి బీఎస్ సురేశా కలిసి ఉన్న కొన్ని ఫొటోలు పోలీసులకు లభ్యమయ్యాయి.