బెంగళూరు: గుంతలమయమైన రహదారిపై దాఖలైన పిల్పై చీఫ్ ఇంజినీర్కు కోర్టు వారెంట్ జారీ చేసింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. ఆ నగరంలోని రోడ్ల దుస్థితి వల్ల పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా రోడ్డుపై గుంతల వల్ల లారీ కింద పడి ఒక టీచర్ మరణించారు. ఈ ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ నెల 15న జరిగే విచారణకు బీబీఎంసీ చీఫ్ ఇంజినీర్ హాజరు కావాలని ఈ నెల 7న కోర్టు ఆదేశించింది. అయితే ఆయన హాజరు కాకపోవడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది. ఈ నెల 17న జరిగే తదుపరి విచారణకు హాజకు కాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
బెంగళూరు నగరంలోని రోడ్లపై గుంతలు, నిర్వహణ లోపంపై దాఖలైన పిల్ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రితూ రాజ్ అవస్తీ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిగింది. చీఫ్ ఇంజినీర్ను కోర్టుకు హాజరుపరచాలని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ కమల్ పంత్ను ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణను గురువారానికి వాయిదా వేసింది.