బెంగుళూరు: కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్(DK Shivakumar).. మంగళవారం జరిగిన రోడ్ షోలో.. జనంపై రూ.500 కరెన్సీ నోట్ల(currency notes)ను విసిరేశారు. మాండ్యా జిల్లాలోని బెవినహల్లిలో ప్రచారం జరుగుతున్న సమయంలో.. ఆయన తన బస్సు రూఫ్టాప్(bus rooftop) నుంచి కరెన్సీ నోట్లను వెదజల్లారు. అసెంబ్లీ ఎ న్నికల నేపథ్యంలో సీఎం అభ్యర్థి శివకుమార్ ప్రజా ధ్వని యాత్రను నిర్వహిస్తున్నారు. మాండ్యా ప్రాంతంలో శక్తివంతమైన వొక్కలింగ్ వర్గం(vokkalinga community) ఓట్లను తనవైపు మళ్లించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.
#WATCH | Karnataka Congress Chief DK Shivakumar was seen throwing Rs 500 currency notes on the artists near Bevinahalli in Mandya district during the ‘Praja Dhwani Yatra’ organized by Congress in Srirangapatna. (28.03) pic.twitter.com/aF2Lf0pksi
— ANI (@ANI) March 29, 2023
నిజానికి మాండ్యా(Mandya)లో వక్కలింగ కమ్యూనిటీదే ఆధిక్యం ఉంటుంది. 2018 ఎన్నికల్లో అక్కడ జేడీఎస్ ఏడు సీట్లను గెలుచుకున్నది. 224 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఇప్పటికే తొలి జాబితాలో 124 మందికి సీట్లను ప్రకటించింది. ప్రస్తుత అసెంబ్లీలో బీజేపీకి 121 సీట్లు ఉన్నాయి. మిగిలినవాటికలో కాంగ్రెష్ 70, జేడీస్కు 30 సీట్లు ఉన్నాయి. 2018లో కాంగ్రెస్, జేడీఎస్లు సంయుక్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 2019లో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు భారీ సంఖ్యలో రాజీనామా చేయడంతో అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.