Karnataka CM | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే, ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరిస్తుందనే చర్చ మొదలైంది. అయితే, కాంగ్రెస్ సాయంత్రం ఎమ్మెల్యేలతో సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. బెంగళూరులోని షాంగ్రీ లా హోటల్లో సాయంత్రం 6 గంటలకు సమావేశం జరుగనున్నది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. ముఖ్యమంత్రి పీఠాన్ని మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ సైతం ఆశిస్తున్నారు.
#WATCH | Karnataka Congress President DK Shivakumar's supporters put up a poster outside his residence in Bengaluru, demanding DK Shivakumar to be declared as "CM" of the state. pic.twitter.com/N6hFXSntJy
— ANI (@ANI) May 14, 2023
ఇద్దరు కీలక నేతలు సీఎం సీటు కోసం పోటీపడుతుండడంతో ఎవరికి దక్కుతుందనేది చర్చనీయాంశంగా మారింది. అయితే, ఇప్పటికే సిద్ధరామయ్య తనయుడు యతీంద్ర సిద్ధరామయ్య కర్ణాటక ప్రజల ప్రయోజనాల కోసం తన తండ్రి సిద్ధరామయ్యే మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. అదే సమయంలో శివకుమార్ మద్దతుదారులు మాత్రమే ఆయనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారన్నారు. డీకే శివకుమార్ 1989 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఎన్నడూ ఓటమి చెందలేదు. మరో వైపు సిద్ధరామయ్యకు 75 సంవత్సరాలు కాగా.. ఆయనకు ఇచే చివరి ఎన్నికలుగా కాంగ్రెస్ శ్రేణులు పేర్కొంటున్నాయి.
#WATCH | Supporters of senior Congress leader Siddaramaiah put up a poster outside Siddaramaiah's residence in Bengaluru, referring to him as "the next CM of Karnataka." pic.twitter.com/GDLIAQFbjs
— ANI (@ANI) May 14, 2023
మరో వైపు కర్ణాటకలో పోస్టర్ వార్ కొనసాగుతున్నది. సిద్ధరామయ్య కాబోయే ముఖ్యమంత్రిగా పేర్కొంటు పోస్టర్లు వెలియగా.. అదే సమయంలో డీకే శివకుమార్కు సైతం మద్దతుగా పోస్టర్లు వెలిశాయి. ఇందులో కాబోయే ముఖ్యమంత్రి అంటూ శుభాకాంక్షలు చెప్పారు. ఈ క్రమంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామలింగారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ కోరికలు, ఆశయాలు ఉంటాయన్నారు. డీకే శివకుమార్, సిద్ధరామయ్యలకే కాకుండా ఎంబీ పాటిల్, జీ పరమేశ్వరన్కు సైతం ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉందని.. ముఖ్యమంత్రి ఎవరనేది హైకమాండ్, ఎమ్మెల్యేలు ఎంపిక చేస్తారన్నారు.