మహారాష్ట్ర, కర్నాటక మధ్య మళ్లీ సరిహద్దు వివాదం తెరపైకి వచ్చింది. మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలకు కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తీవ్రంగా మండిపడ్డారు. తమ తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిసారీ సరిహద్దు వివాదాన్ని తెస్తున్నారని, రెచ్చగొట్టే భాషలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
సరిహద్దు సమస్య విషయంలో తాము చాలా క్లారిటీతో వున్నామని, తమ నిర్ణయానికే తాము కట్టుబడి వుంటామని సీఎం బొమ్మై స్పష్టం చేశారు. ఈ విషయం మహారాష్ట్ర పాలకులకు కూడా తెలుసని, అయితే రాజకీయ ప్రయోజనాల కోసం దీనిని వాడుతున్నారని ఆక్షేపించారు.
రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి రెచ్చగొట్టే భాష మాట్లాడుతున్నారు. రాజకీయ అవసరాల కోసం ఇలాంటి భాష వాడొద్దని గట్టిగా కోరుతున్నాను. మహారాష్ట్ర సర్కార్ ఇబ్బందుల్లో కూరుకుపోయింది. రాజకీయంగా మనుగడ సాధించడానికి అక్కడి నేతలు ఇలాంటి రెచ్చగొట్టే భాష మాట్లాడుతున్నారు అంటూ సీఎం బొమ్మై మండిపడ్డారు.
డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఏమన్నారంటే..
మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎల్లోని కొన్ని ప్రాంతాల్లో మరాఠీ మాట్లాడే ప్రజలున్నారని, ఆ ప్రాంతాలను మహారాష్ట్రలో కచ్చితంగా కన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ మాట్లాడుతూ..
బెల్గాం, నిపాణీ, కార్వార్ లాంటి సరిహద్దు ప్రాంతాలతో పాటు మరికొన్ని ప్రాంతాలు మరాఠీ మాట్లాడే ప్రాంతాలున్నాయి. ఇవి కర్నాటక సరిహద్దు ప్రాంతాలు. ఇప్పటికీ మన రాష్ట్రంలో అవి భాగం కాలేదు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక్క హామీ ఇస్తున్నాను. మహారాష్ట్రలో భాగం కావడానికి ఆ ప్రజలు చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతిస్తాం అని పవార్ ప్రకటించారు.