న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో కర్ణాటక బీజేపీకి ఆ పార్టీ ఎమ్మెల్యేల నుంచి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. దక్షిణ కర్ణాటకలోని పుత్తూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సంజీవ్ మతాందూర్ గుర్తుతెలియని ఒక మహిళతో దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమంలో వైరల్గా మారాయి.
ఆమె ఎవరు? ఆమెతో ఎమ్మెల్యేకు గల వ్యక్తిగత సంబంధాలపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఫొటోల వ్యవహారం కర్ణాటక బీజేపీకి తలనొప్పిగా మారింది. ఎన్నికల వేళ పార్టీ ఇమేజ్ను తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్న విమర్శలున్నాయి. బీజేపీకి చెందిన వారే ఆయన వ్యక్తిగత ఫొటోలు బహిర్గతం చేసి, సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారని, పార్టీ టికెట్ ఆయనకు రాకూడదన్న నెపంతో ఇదంతా జరుగుతున్నదన్న చర్చ సాగుతున్నది.