బెంగళూరు, జనవరి 3 : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడి బీజేపీ నాయకులు ప్రజలకు కావాల్సిన అభివృద్ధి, సంక్షేమం వంటి అవసరమైన అంశాలను పక్కదోవ పట్టించి, మతపరమైన అంశాలను తెరపైకి తెచ్చి ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావిస్తున్నారు. తాజాగా కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ నళిన్కుమార్ కటీల్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ.
ఓ సభలో ఆయన మాట్లాడుతూ ‘రోడ్లు, డ్రైనేజీ వంటి చిన్న విషయాల గురించి మాట్లాడొద్దు. మీ పిల్లల భవిష్యత్తుపై మీకు బెంగ ఉంటే లవ్ జిహాద్ గురించి ఆలోచించండి. లవ్ జిహాద్ను అడ్డుకోవాలంటే బీజేపీ అవసరం ఉంది’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా ఇంతకాలం ప్రభుత్వంలో ఉండి ఏం అభివృద్ధి చేశామో అడగవద్దని, మతపరమైన అంశాల గురించే ఆలోచించాలని ప్రజలకు ఆయన చెప్పినట్లయ్యింది.