బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ చెప్పారు. చాలా ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ స్థానాలు వస్తాయని ప్రకటించాయని, దాంతో రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందనే ప్రచారం జరుగుతున్నదని, వాస్తవానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతున్నదని ఆయన ధీమా వ్యక్తంచేశారు.
ఎగ్జిట్పోల్స్ అంచనాలు మా పార్టీ అంచనాలు కావని, అవి ఆయా సంస్థల సొంత అంచనాలని, మేం ఆ అంచనాలను పరిగణలోకి తీసుకోవడం లేదని, మా అంచనాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ 141 స్థానాల్లో విజయం సాధిస్తుందని జోష్యం చెప్పారు. మెజారిటీ రాకపోతే జేడీఎస్ మీకు మద్దతిస్తుందా..? అన్న ప్రశ్నకు.. ఆ విషయం తనకు తెలియదని, వాళ్లే తేల్చుకుంటారని అన్నారు. అయినా కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వస్తే, రాకపోతే ఆలోచనేమీ తనకు లేదని, తాము కచ్చితంగా అధికారంలోకి వస్తున్నామనే ఆలోచన మాత్రమే తనకున్నదని డీకే వ్యాఖ్యానించారు.
#WATCH | Exit polls have their own theory. We don’t go by those samples, my sample size is too high and in that, we will have a comfortable majority. I do not know about JD(S), let them take their own call. I don’t have any backup plan, my only plan is that Congress party will… pic.twitter.com/agJ551kIyb
— ANI (@ANI) May 12, 2023