న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్లో ముసలం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కెప్టెన్-సిద్ధూ వార్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ స్పందించారు. ప్రస్తుతం కాంగ్రెస్లో అధ్యక్షుడు ఎవరూ లేరని చెప్పిన సిబల్.. పంజాబ్ వివాదంలో నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారో కూడా తెలియడం లేదని అన్నారు.
‘‘మా పార్టీలో ప్రెసిడెంట్ లేరు. ఈ నిర్ణయాలన్నీ ఎవరు తీసుకుంటున్నారో మాకుత తెలియదు. మాకు తెలుసు, కానీ తెలియదు’’ అని సిబల్ చెప్పారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్గా ఎన్నికైన రెండు నెలలకే నవజోత్ సింగ్ సిద్ధూ రాజీనామా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ పదవిలో సిద్ధూ వచ్చిన తర్వాత పంజాబ్ సీఎంగా అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. తనకు అవమానం జరిగినట్లు భావించి రాజీనామా చేస్తున్నట్లు అమరీందర్ అప్పట్లో చెప్పుకొచ్చారు.