లక్నో: కన్వర్ యాత్రలో (Kanwar Yatra) తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. హరిద్వార్లో (Haridwar) పవిత్ర జలాలను (Holy water) తీసుకొని వెళ్తున్న కన్వరియాల (Kanwariyas) వాహనం ఉత్తరప్రదేశ్లోని (Uttar Pradesh) మీరట్లో (Meerut) విద్యుధాఘతానికి (Electrocuted) గురైంది. దీంతో ఐదుగురు కన్వరీలు మృతిచెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. హరిద్వార్లో పవిత్ర గంగా జలం తీసుకుని సొంతూర్లకు వెళ్తున్న కన్వరీల వాహనం శనివారం రాత్రి 8 గంటలకు యూపీలోని మీరట్ చేరుకున్నది.
ఈ క్రమంలో వాహనంలోని స్పీకర్.. విద్యుత్ హై టెన్షన్ వైరుకు (High-tension wire) తగిలింది. దీంతో వాహనం మొత్తం కరెంట్ షాక్ రావడంతో అందులో ఉన్న 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని హుటాహుటిన దవాఖానకు తరలించారు. అయితే వారిలో ఐదుగురు మరణించగా, మిగిలినవారు చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్లడించారు. కన్వరీల మృతిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే వారు చనిపోయారని నిరసనకు దిగారు. దీంతో గ్రామంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అదనపు బలగాలను మోహరించారు.