న్యూఢిల్లీ: ఢిల్లీ, పంజాబ్లోని లోక్సభ స్థానాలకు సంబంధించి 10 మంది అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ఆదివారం విడుదల చేసింది. జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్కు ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గం టికెట్ ఇచ్చింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా మనోజ్ తివారీ పోటీచేస్తున్నారు.
పంజాబ్ మాజీ సీఎం చరణ్జిత్ సింగ్ ఛన్ని జలంధర్ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఒడిశా అసెంబ్లీ ఎన్నికలకు హస్తం పార్టీ 75 మంది అభ్యర్థులను ప్రకటించింది.