ముంబై: మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి గ్లామర్ జోడయ్యింది. ఇవాళ బుల్లితెర అందాల నటి కామ్యా పంజాబీ ( Kamya Punjabi ) కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడు భాయ్ జగ్తప్, మరో నేత తెహసీన్ పూనావాలా సమక్షంలో ఆమె పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. భాయ్ జత్తప్ కండువా కప్పి కామ్యా పంజాబీని పార్టీలో చేర్చుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, అగ్ర నేతలు రాహుల్గాంధీ, ప్రియాంకాగాంధీల పనితీరుతో ఇన్స్పైర్ అయ్యి కామ్యా పంజాబీ కాంగ్రెస్ పార్టీలో చేరారని తెహసీన్ పూనావాలా ట్వీట్ చేశారు.
బుల్లితెర నటి కామ్యా పంజాబీ పలు టీవీ షోల్లో నటిస్తున్నది. బుల్లితెరపై ఆమె తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. బిగ్బాస్ సీజన్-7 కంటెస్టెంట్గా కూడా ఆమె కనిపించారు.