భోపాల్ : లోక్సభ ఎన్నికలకు ముందు మధ్య ప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్కు అత్యంత సన్నిహిత నేత బీజేపీలో చేరారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ కూడా బీజేపీలో చేరారు. కాంగ్రెస్ మాజీ ప్రతినిధి సయ్యద్ జాఫర్ సోమవారం భోపాల్లో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ వీడీ శర్మ సమక్షంలో కాషాయ పార్టీలో చేరారు.
చింద్వారాకు చెందిన జాఫర్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్కు సన్నిహితుడు కావడం గమనార్హం. జాఫర్ ప్రస్తుతం మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అయితే జాఫర్ ప్రస్తుతం కాంగ్రెస్లో ఎలాంటి పదవిలో లేరని రాష్ట్ర కాంగ్రెస్ మీడియా విభాగం చైర్మన్ కేకే మిశ్రా స్పష్టం చేశారు.
కాగా కమల్ నాథ్ కాషాయ పార్టీలో చేరతారని ఇటీవల వార్తలు రాగా, అయితే ఈ వార్తలు మీడియా సృష్టేనని మాజీ సీఎం తోసిపుచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ విధానాల పట్ల ఆకర్షితులై జాఫర్తో పాటు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మనీషా దూబే, ఇతర పార్టీ నేతలు, బీఎస్పీ రాష్ట్ర ఇన్చార్జ్ రమ్సక్ వర్మ బీజేపీలో చేరారని ఆ పార్టీ ప్రతినిధి వెల్లడించారు.
Read More :
Mrunal Thakur | మృణాళ్ ఠాకూర్ స్టన్నింగ్ లుక్స్.. పూజాహెగ్డేను బీట్ చేసినట్టే..!