న్యూఢిల్లీ: కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రసన్న బీ వరలేను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం శుక్రవారం సిఫారసు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో శుక్రవారం కొలీజియం సమావేశం జరిగింది. దేశంలోని హైకోర్టు సీనియర్ న్యాయమూర్తుల్లో జస్టిస్ ప్రసన్న ఒకరని, అంతేకాకుండా ఆయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్లో ఆయన మాత్రమే ఎస్సీ వర్గానికి చెందినవారని తెలిపింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ 2023 డిసెంబరు 25న పదవీ విరమణ చేయడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడం కోసం తాజా సిఫారసు చేసింది.