న్యూఢిల్లీ/రాంచీ, ఏప్రిల్ 28: స్నేహాన్ని మించిది లోకాన లేదు అనడానికి నిలువెత్తు నిదర్శనం ఈ ఘటన. కరోనా సోకిన తన స్నేహితుడికి ఆక్సిజన్ అవసరం ఉన్నదని తెలిసి ఒక్కరోజులో 1300 కిలోమీటర్లు ప్రయాణించి అతడికి ప్రాణవాయువును అందించాడు దేవేంద్ర శర్మ. రంజన్, దేవేంద్ర శర్మ మంచి స్నేహితులు. అయితే ఇటీవల రంజన్కు కరోనా సోకి ఉత్తరప్రదేశ్లోని ఘాజియాబాద్లో ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. అతడికి అందించే ప్రాణవాయువు సరిపడా లేదని సమాచారం తెలిసిన దేవేంద్ర.. జార్ఖండ్ రాజధాని రాంచీ నుంచి ఆక్సిజన్ సిలిండర్ను తీసుకొని కారులో ప్రయాణించాడు. ఒక్కరోజులో దాదాపు 1300 కిలోమీటర్లు ప్రయాణించి స్నేహితుడికి ఆక్సిజన్ అందజేసి ప్రాణాలు కాపాడాడు.