ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే భవిష్యత్తులో నంబర్ వన్ నాయకుడు అవుతారని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. కరోనా కల్లోలంలో కూడా ఆయన రాజకీయాలకు అతీతంగా అద్భుతంగా పనిచేశారని రౌత్ ప్రశంసించారు. కరోనా వేళ ఆయన పనితీరును ప్రపంచమంతా చూసిందన్నారు. ప్రస్తుతం ఉద్ధవ్ థాకరే రాష్ట్రంలో నంబర్ వన్ నాయకుడిగా ఎదిగారని, భవిష్యత్తులో దేశంలోనే నంబర్ వన్ నేతగా అవతరించనున్నారని సంజయ్ రౌత్ పేర్కొన్నారు.
ఇక బీజేపీ నేతల జన్ ఆశీర్వాద్ యాత్రపై సంజయ్ రౌత్ మండిపడ్డారు. వారి యాత్రలతో దేశంలో కరోనా థర్డ్ వేవ్ విస్తరిస్తుందని చెప్పారు. బీజేపీ జన్ ఆశీర్వాద్ యాత్ర కరోనా థర్డ్వేవ్కు స్వాగతం పలుకుతుందన్నారు. బీజేపీ నేతలు అవసరం లేకున్నా యాత్ర నిర్వహిస్తున్నారని విమర్శించారు. మహారాష్ట్రలో బీజేపీ యాత్రవల్ల కరోనా ఉధృతమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇటీవల కేంద్ర మంత్రివర్గంలో చేరిన మంత్రులు జన్ ఆశీర్వాద్ యాత్ర పేరుతో ప్రజల ఆశీస్సుల కోసం జనంలోకి వెళ్తున్నారు.