WHO | న్యూఢిల్లీ: జల్జీవన్ మిషన్ లక్ష్యాన్ని భారత్ చేరుకుంటే డయేరియా వల్ల సంభవించే 4 లక్షల మరణాలను నివారించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. తాగునీటి వసతి, పరిశుభ్రతకు సంబంధించి ప్రపంచ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవాలంటే భారత్ తన లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన జల సరఫరా, పరిశుభ్రత విభాగాధిపతి రిచర్డ్ జాన్స్టన్ తెలిపారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అధ్యయన ఫలితాలను ఆయన వెలువరించారు. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇవ్వడం వల్ల ప్రతిరోజు 66.6 మిలియన్ గంటల సమయం, 101 మిలియన్ డాలర్లు ఆదా అవుతాయని తేలిందన్నారు.