ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ జాకీ ష్రాఫ్ భార్య, బాలీవుడ్ మరో నటుడు టైగర్ ష్రాఫ్ తల్లి అయేషా ష్రాఫ్ను అలెన్ ఫర్నాండో అనే వ్యక్తి మోసం చేశాడు. వంద కాదు, వెయ్యి కాదు, లక్ష కాదు.. ఏకంగా రూ.58 లక్షలకు ఆమెను బురిడీ కొట్టించాడు. అయేషా ష్రాఫ్ ఫిర్యాదు మేరకు ముంబైలోని శాంటాక్రజ్ పోలీస్స్టేషన్ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.
అనంతరం బాధితురాలు ఇచ్చిన ఆధారాల సాయంతో నిందితుడిని గాలించి పట్టుకున్నారు. అయేషా ష్రాఫ్ ఫిర్యాదు మేరకు ఆమెను రూ.58 లక్షలకు మోసం చేసిన నిందితుడిన అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నదని చెప్పారు.