న్యూఢిల్లీ,: ఇండియాలో మృతిచెందిన అమెరికా ఆర్మీ అధికారి అస్థికలు ఆయన స్వస్థలానికి చేరేందుకు 58 ఏండ్లు పట్టింది. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత ఇంటికి చేరిన ఆయన అస్థికలను చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. అమెరికాకు చెందిన మేజర్ జనరల్ పికెట్ మొదటి, రెండో ప్రపంచయుద్ధాల్లో పాల్గొన్నారు. 1965లో ఇండియాకు వచ్చారు.
గుండెపోటుతో డార్జిలింగ్లో కన్నుమూశారు. భౌతికకాయాన్ని అధికారులు స్థానిక శ్మశాన వాటికలో ఖననం చేశారు. ఆ అధికారి అస్థికల కోసం ఆయన కుటుంబ సభ్యులు, అమెరికా సర్కారు ఏండ్లుగా కృషిచేస్తూనే ఉన్నాయి. ఇరుదేశాల అధికారుల మధ్య సమన్వయం ఉన్నప్పటికీ ఆ అధికారి అస్థికలు ఇంటికి చేరేందుకు ఆరు దశాబ్దాలు పట్టింది.