శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) మరో ఘనతను సొంతం చేసుకున్నది. బాహుబలి జీఎస్ఎల్వీ మార్క్-3 (GSLV MARK-3) రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ఉన్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శనివారం అర్ధరాత్రి 12.07 గంటలకు జీఎస్ఎల్వీ-మార్క్ 3 () దీనినే ఎల్వీఎం3-ఎం2 అని పిలుస్తున్నారు) రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ బాహుబలి రాకెట్ విదేశాలకు చెందిన 36 ఉపగ్రహాలను సక్సెస్ఫుల్గా నిర్దేశి కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రయోగం 19 నిమిషాల్లోనే ముగిసింది. ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కోసం నిర్వహించిన మొదటి వాణిజ్య ప్రయోగం ఇదే కావడం గమనార్హం.
#WATCH | ISRO launches LVM3-M2/OneWeb India-1 Mission from Satish Dhawan Space Centre (SDSC) SHAR, Sriharikota
(Source: ISRO) pic.twitter.com/eBcqKrsCXn
— ANI (@ANI) October 22, 2022
ప్రైవేట్ శాటిలైట్ కమ్యూనికేషన్ కంపెనీ అయిన వన్వెబ్కి చెందిన 36 బ్రాడ్బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ఈ రాకెట్ ద్వారా నిగిలోకి పంపించారు. యూకేకి చెందిన ఈ ఉపగ్రహాలన్నీ కలిపి 5,200 కిలోల వరకు బరువు ఉంటాయి. ఉపగ్రహాలు కక్ష్యలోకి ప్రవేశించడంతో యూకేకి చెందిన గ్రౌండ్స్టేషన్ సిబ్బంది వాటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
LVM3 M2/OneWeb India-1 mission is completed successfully. All the 36 satellites have been placed into intended orbits. @NSIL_India @OneWeb
— ISRO (@isro) October 22, 2022
కాగా, ప్రయోగం విజయంతం కావడంపై ఇస్రో చైర్మన్ సోమనాథ్ హర్షం వ్యక్తం చేశారు. యూకేకు చెందిన 108 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని.. అందులో భాగంగానే ఇప్పుడు 36 ఉపగ్రహాలను పంపించామని తెలిపారు. ఈ ప్రయోగం తర్వాత వరుసగా రాకెట్ ప్రయోగాలు చేపడతామన్నారు. వచ్చే ఏడాది మార్చిలోపు మరో నాలుగు రాకెట్లను ప్రయోగిస్తామని చెప్పారు.
We’ve already started the (Diwali) celebration …16 out of 36 satellites have successfully separated safely, and the remaining 20 satellites will be separated. The data will come a little later & the operation of observing is underway: ISRO Chairman Dr S Somanath https://t.co/qluI8P4EPV pic.twitter.com/UumIE3t7LC
— ANI (@ANI) October 22, 2022