శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) మరో రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ-సీ56 (PSLV-C56) వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. దీనిద్వారా 7 విదేశీ ఉపగ్రహాలను (Foreign satellites) నిర్దేశిత కక్షలోకి పంపించనున్నారు. ఇందులో సింగపూర్కు చెందిన డీఎస్టీఏ ఎస్టీ ఇంజినీరింగ్ సంస్థకు చెందిన డీఎస్ ఎస్ఏఆర్ (DS SAR) ఉపగ్రహంతోపాటు నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీకి చెంచిన వెలాక్స్-ఏఎం, ఆర్కేట్, స్కూబ్-2, న్యూలియాన్, గెలాసియా-2, ఓఆర్బీ-12 శాటిలైట్లు ఉన్నాయి. ఇవన్నీ సింగపూర్కు చెందినవే కావడం విశేషం.
44.4 మీటర్ల పొడవు, 228 టన్నుల బరువున్న పీఎస్ఎల్వీ-సీ56.. ఉప్రగహాలను 535 కిలోమీటర్ల ఎత్తులోని ఎర్త్ ఆర్బిట్లో విడిచిపెడుతుంది. తొలుత ఈ ప్రయోగాన్ని జూలై 26నే చేయాలనుకున్నప్పటికీ సాంకేతిక కారణాలతో నేటిని వాయిదా వేశారు. దీనికి సంబంధించిన కౌంట్డౌన్ శనివారం ఉదయం 5.01 గంటలకు ప్రారంభించారు.
#WATCH | Indian Space Research Organisation (ISRO) launches its PSLV-C56 with six co-passenger satellites from Satish Dhawan Space Centre (SDSC) SHAR, Sriharikota.
(Source: ISRO) pic.twitter.com/2I1pNvKvBH
— ANI (@ANI) July 30, 2023