బెంగళూరు, సెప్టెంబర్ 28: ఖగోళ రహస్యాలను శోధించడంలో భాగంగా అత్యాధునిక ఖగోళ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేసే మార్గాలను అన్వేషిస్తున్నట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు (ఇస్రో) చెందిన అధికారి ఒకరు మంగళవారం తెలిపారు. రోదసిలోని ఖగోళ వస్తువుల చిత్రాలను తీసి, విశ్లేషించడానికి ఉద్దేశించిన స్పేస్ టెలిస్కోప్ ‘ఆస్ట్రోశాట్’కు మంగళవారంతో ఆరేండ్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే ఆ అధికారి పై విధంగా స్పందించారు. కాగా ఐదేండ్లపాటు సేవలు అందించేలా ‘ఆస్ట్రోశాట్’ను రూపొందించారు.