మథుర: బృందావన్లో ఇస్కాన్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తుందని ఉత్తరప్రదేశ్ మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయ్ చెప్పారు. భగవద్గీత, సనాతన ధర్మాలను బోధిస్తుందని తెలిపారు. ఇది మన దేశ భవిష్యత్తు అవుతుందన్నారు.
ఇస్కాన్ బృందావన్లోని గురుకుల్లో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. వెయ్యేళ్ల క్రితం 10 వేల మంది విద్యార్థులకు విద్య నేర్పిన నలంద విశ్వవిద్యాలయం స్థాయికి ఇస్కాన్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం చేరుకుంటుందన్నారు.