IRCTC | పశ్చిమ యూపీలో విపరీతమైన పొగ మంచు కారణంగా తేజస్ ఎక్స్ప్రెస్ రెండు గంటలు ఆలస్యంగా నడిచింది. రెండు గంటలు ఆలస్యంగా నడవడం వల్ల ఐఆర్సీటీసీ ప్రయాణికులకు పరిహారం చెల్లించింది. శుక్రవారం తేజస్ ఎక్స్ప్రెస్ అలీగఢ్, గజియాబాద్ మధ్య ఏర్పడ్డ పొగమంచులో ఇరుక్కుపోయింది. దీంతో 12ః25 నిమిషాల కల్లా ఢిల్లీకి చేరాల్సింది కాస్తా.. మధ్యాహ్నం 2:19 నిమిషాలకు చేరుకుంది. ఇక ఢిల్లీ నుంచి 4:59 నిమిషాలకు బయలు దేరాల్సింది కాస్తా… ఓ గంట ఆలస్యంగా బయల్దేరింది. ఇతర స్టేషన్లకూ ఆలస్యంగానే చేరుకుంది. మరోవైపు ఢిల్లీ నుంచి లక్నోకు ప్రయాణిస్తున్న ఈ ట్రైన్లో 544 ప్రయాణికులు ఉన్నారు. ఐఆర్సీటీసీ నిబంధనల ప్రకారం రైల్వే శాఖ వీరందరికీ 250 రూపాయల చొప్పున పరిహారం చెల్లించింది. మొత్తం 1.36 లక్షల రూపాయలను పరిహారంగా చెల్లించింది.