ఢిల్లీ, డిసెంబర్ 8: సినీ నటి మెహ్రీన్ గుర్తుందా.. 2021లో ఆమెకు ఒక వ్యక్తితో ఎంగేజ్ మెంట్ జరిగింది. అయితే పెళ్లి కాకుండానే వారి బంధం రద్దయ్యింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో కాదు భవ్య బిష్ణోయ్. మాజీ ముఖ్యమంత్రి భజన్లాల్ మనవడు అయిన బిష్ణోయ్. ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే. ఇప్పుడు ఆయన ఐఏఎస్ అధికారిని వివాహం చేసుకోబోతున్నారు. ఇందులో పెద్ద విశేషమేమీ లేకపోయినా ఈ వివాహానికి ఢిల్లీ సహా రెండు రాష్ర్టాల ప్రజలు హాజరవ్వడం మాత్రం విశేషమే. పుష్కర్, ఆదంపూర్, ఢిల్లీ నగరాల్లో రిసెప్షన్లు నిర్వహించనున్నారు. డిసెంబర్ 22న రాజస్థాన్ ఉదయ్పూర్లో జరిగే వీరి వివాహానికి 80 గ్రామాలకు చెందిన మూడు లక్షల మందికి ఆహ్వానాలు వెళ్లాయి. వీరి వివాహం గురించే ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతున్నది. 2019లో సివిల్స్ సాధించి సిక్కింలోని గ్యాంగ్టక్లో విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారిణి పరిణి బిష్ణోయ్తో భవ్య బిష్ణోయ్కు ఏప్రిల్లో ఎంగేజ్మెంట్ జరుగగా, ఇప్పుడు పెండ్లి కోసం ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.