లక్నో: అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా చూసి స్ఫూర్తి పొందిన ఏడుగురు వ్యక్తులు ఎర్రచందనం స్మగ్లింగ్ను ప్రారంభించి పోలీసులకు దొరికిపోయారు. ఉత్తరప్రదేశ్లోని మథుర ప్రాంతానికి చెందిన ఏడుగురు వ్యక్తులు పుష్ప సినిమా చూసి తాము కూడా త్వరగా డబ్బు సంపాదించి సినిమాలో పుష్పరాజ్లా మారాలనుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఎర్రచందనాన్ని అక్రమంగా మథురకు తరలించి అమ్మాలనుకున్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ హైవే పోలీసులకు దొరికిపోయారు. వీరి వద్ద 563 కిలోల ఎర్రచందనం దొరికింది.