నూఢిల్లీ : న్యూఢిల్లీ నుంచి సోమవారం యూకేలోని మాంచెస్టర్కు బయల్దేరిన ఇండిగో విమానం పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో వెనక్కి తిరిగి వచ్చింది. ఇథియోపియా సరిహద్దులకు వెళ్లినప్పుడు యుద్ధం కారణంగా విమాన ప్రయాణంపై ఆంక్షలు విధించడంతో చేసేదేమీ లేక విమానం తిరుగు ముఖం పట్టింది.
ఫ్లైట్ట్రేడర్24 కథనం ప్రకారం ఏడు గంటపాటు ప్రయాణించాక హఠాత్తుగా విమానం యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది. అసాధారణమైన గల్ఫ్ ఆఫ్ అడెన్ మార్గం మీదుగా విమానం ప్రయాణించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఫిబ్రవరి 26 తర్వాత మాంచెస్టర్కు ఢిల్లీ నుంచి బయల్దేరిన మొదటి విమానం ఇదే కావడం గమనార్హం.