న్యూఢిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన టెక్ సబ్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్(Indigenous Technology Cruise Missile)ను ఇవాళ డీఆర్డీవో అధికారులు విజయవంతంగా పరీక్షించారు. ఒడిశా తీరంలోని చాందీపూర్లో ఉన్న ఐటీఆర్ కేంద్రంలో ఈ పరీక్ష జరిగింది. రక్షణ శాఖ ఈ పరీక్షకు చెందిన అప్డేట్ ఇచ్చింది. అనుకున్నట్లు అన్ని సబ్సిస్టమ్స్ పనిచేసినట్లు ఆ ప్రకటనలో తెలిపారు. క్రూయిజ్ మిస్సైల్ వెళ్లిన మార్గాన్ని క్షుణ్ణంగా స్టడీ చేశారు. రేడార్, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్, టెలిమెట్రీ ద్వారా మిస్సైల్ పర్ఫార్మెన్స్ను మానిటర్ చేశారు. వేర్వేరు లొకేషన్లలో ఈ టెస్ట్ జరిఇంది.
భారతీయ వైమానిక దళానికి చెందిన సుఖోయ్-30-ఎంకే ఐ విమానం కూడా క్షిపణ మార్గాన్ని మానిటర్ చేసింది. ఈ పరీక్ష ద్వారా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ప్రొపల్షన్ వ్యవస్థను కూడా స్టడీ చేశారు. బెంగుళూరుకు చెందిన గ్యాస్ టర్బైన్ రీసర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ ఈ సిస్టమ్ను డెవలప్ చేసింది. అడ్వాన్స్డ్ ఏవియానిక్స్, సాఫ్ట్వేర్ను ఆ మిస్సైల్లో పొందుపరిచారు. బెంగుళూరులోని డీఆర్డీవోకు చెందిన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ దీన్ని డెవలప్ చేసింది. వివిధ డీఆర్డీవో ల్యాబ్ల నుంచి ఈ క్షిపణి పరీక్షను శాస్త్రవేత్తలు పరిశీలించారు.
Indigenous Technology Cruise Missile (ITCM) successfully flight tested today from ITR Chandipur, off the coast of Odisha. ITCM is long range subsonic cruise missile powered by indigenous propulsion system @PMOIndia @DefenceMinIndia @SpokespersonMoD pic.twitter.com/wLlpV4wHkx
— DRDO (@DRDO_India) April 18, 2024