న్యూఢిల్లీ, ఆగస్టు 18: భారత్లో తొలి లాంగ్ రేంజ్ రివాల్వర్ ‘ప్రబల్’ను శుక్రవారం ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అడ్వాన్స్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా కంపెనీ దీన్ని తయారు చేసింది. 50 మీటర్ల లక్ష్యాన్ని చేధించేలా ఈ పిస్తోలుతో కాల్పులు జరపవచ్చు. ఈ తుపాకీ బారెల్ పొడవు 76 మి.మీ, మొత్తం పొడవు 177.6 మి.మీ. తూటాలు లేకుండా తుపాకీ బరువు 700 గ్రాములు.
ట్రిగ్గర్ లాగడానికి వీలుగా ఈ పిస్తోలుకు సైడ్ స్వింగ్ సిలిండర్ అమరినట్లు తయారీ కంపెనీ తెలిపింది. మార్కెట్లో ఉన్న తుపాకీలన్నింటి కంటే ఇది బాగా ఫైరింగ్ చేస్తుందని చెప్పింది. తుపాకీ లైసెన్స్ ఉన్నవారు దీన్ని కొనుగోలు చేయవచ్చని వెల్లడించింది.