నోయిడా, ఫిబ్రవరి 13: దేశంలో మొట్టమొదటి చాట్జీపీటీ ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టూల్ను వెలాసిటీ అనే సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘లెక్సీ’ పేరుతో తెచ్చిన ఈ టూల్ ద్వారా తమ వినియోగదారులకు సులువైన, మెరుగైన సేవలు అందిస్తామని వెలాసిటీ సంస్థ కో ఫౌండర్ అభిరూప్ మెధేకర్ పేర్కొన్నారు. వెలాసిటీ.. ఒక ఫైనాన్షియల్ టెక్నాలజీ సంస్థ. ఇది ఈ-కామర్స్ వ్యాపారులకు వారి వ్యాపారాలపై విశ్లేషణలు అందిస్తుంది. రోజువారీ వ్యాపార నివేదికలు పంపిస్తుంది. దీనికే ఇప్పుడు ఏఐ టూల్ను అనుసంధానం చేశారు.