న్యూఢిల్లీ : ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించేందుకు భారత రైల్వే టికెట్ బుకింగ్ విధానంలో కొన్ని మార్పులను చేసింది. సీనియర్ సిటిజన్లు, 45 ఏండ్లు పైబడిన మహిళలు, గర్భిణులకు టికెట్ బుక్ చేసే సమయంలోనే ఆటోమేటిక్గా లోయర్ బెర్త్ను కేటాయించే విధానాన్ని ప్రవేశపెట్టింది.
ఆ సమయంలో లోయర్ బెర్త్లు అందుబాటులో ఉంటేనే వారికి దానిని కేటాయిస్తారు. అయితే సిబ్బంది తరువాత ఆయా సీట్ల లభ్యతను బట్టి వాటిని వారికి కేటాయించ వచ్చు. అలాగే లోయర్ బెర్త్ లభ్యమైతేనే బుక్ చేయమనే ఆప్షన్ను ఎంచుకోవచ్చు. రిజర్వ్ కోచ్లలో నిద్ర వేళలు రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు నిర్ణయించారు.