న్యూఢిల్లీ: షార్జా నుంచి ఢిల్లీకి విమానంలో వచ్చిన భారతీయ ప్రయాణీకుడిని కస్టమ్స్ అధికారులు గురువారం అడ్డుకున్నారు. అతడ్ని తనిఖీ చేయగా రూ.15.83 లక్షల విలువైన ఫ్రాంక్ ముల్లర్ వాచ్, రూ.18 లక్షల విలువైన మొబైల్ ఫోన్స్ లభించాయి. వీటిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ఆ ప్రయాణికుడు అంగీకరించాడు. దీంతో ఢిల్లీ విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు అతడ్ని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.