హైదరాబాద్, నవంబర్ 3: భారత గేమింగ్ మార్కెట్ రూ.21 వేల కోట్లకు చేరిందని లుమికాయ్ నివేదిక స్పష్టం చేసింది. ఈ మార్కెట్ 2027 నాటికి రూ.71 వేల కోట్లకు చేరుతుందని నివేదిక అంచనా వేసింది. ఇండియా గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (ఐజీడీసీ) సదస్సు గురువారం హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ప్రారంభమైంది. ఈ సదస్సులో భాగంగా లుమికాయ్ ఫౌండింగ్ జనరల్ పార్ట్ నర్లు జస్టిన్ శ్రీరాం కీలింగ్, సలోనీ సెహగాల్ ఈ నివేదికను విడుదల చేశారు.