శ్రీనగర్: జమ్ముకశ్మీర్ రాష్ట్రం పూంచ్ జిల్లాలోని బాలాకోట్ ఏరియాలో భారత సైనికులు పేలకుండా పడివున్న ఓ మోర్టార్ షెల్ను గుర్తించారు. వెంటనే పై అధికారులకు సమాచారం అందించారు. దాంతో ఉన్నతాధికారులు, బాంబు డిస్పోజల్ టీమ్ హుటాహుటిన మోటార్ షెల్ను గుర్తించిన ప్రాంతానికి చేరుకున్నారు. పకడ్బందీ ఆపరేషన్ చేపట్టి ఆ మోర్టార్ షెల్ను నిర్వీర్యం చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని, ఎవరికీ గాయాలు కూడా కాలేదని, ఎలాంటి ఆస్తినష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.