న్యూయార్క్: పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా నేత షాహిద్ మహమూద్ను గ్లోబల్ టెర్రరిస్టుగా పరిగణిస్తూ భారత్, అమెరికా చేసిన ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితిలో చైనా అడ్డుకున్నది. ఉగ్రవాదులను బ్లాక్లిస్టులో పెట్టేందుకు అమెరికా, భారత్ చేస్తున్న ప్రయత్నాలను గత కొన్ని నెలల్లో చైనా అడ్డుకోవడం ఇది నాలుగవసారి.
1267 ఆల్ఖయిదా ఆంక్షల కమిటీ ప్రకారం ఉగ్రవాది షాహిద్పై నిషేధం విధించాలని భారత్, అమెరికా ప్రతిపాదించాయి. దీన్ని చైనా అడ్డుకున్నది. టెర్రరిస్టులపై చర్యలు చేపట్టకుండా ఐక్యరాజ్యసమితిలో చైనా అడ్డుకోవడం ఇది నాలుగోసారి. షాహిద్ మహమూద్ గ్లోబల్ ఉగ్రవాది అని 2016 డిసెంబర్లో అమెరికా ట్రెజరీ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే.
2007 నుంచే లష్కరే కోసం..
లష్కరే తోయిబా ఉగ్ర సంస్థలో షాహిద్ కీలక సభ్యుడు. చాలా ప్రాంతాల్లో లష్కరేను విస్తరించడానికి నిధులు కూడా సమర్చాడు. పలు దేశాల్లో ఉగ్ర కార్యకలపాలు నిర్వహించాడు. 2007 నుంచే షాహిద్ లష్కరే కోసం పనిచేస్తున్నాడు. లష్కరే పబ్లికేషన్స్లో కీలక సభ్యుడిగా పనిచేశాడు. 2015-16 కాలంలో లష్కరే అనుబంధ విభాగం ఫలహ్ ఇ ఇన్సానియత్ ఫౌండేషన్ వైస్ ఛైర్మన్గా పని చేశాడు.