న్యూఢిల్లీ, డిసెంబర్ 2: కరోనా నియంత్రణలో భాగంగా చిన్నారులకు కూడా వ్యాక్సిన్ వేయడానికి కేంద్రం ప్రయత్నాలు మొదలెట్టింది. ఈ క్రమంలో జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకొవ్-డీ టీకాను తొలుత ఏడు రాష్ర్టాల్లో వినియోగించనున్నారు. తమిళనాడు, మహారాష్ట్ర, యూపీ, పశ్చిమబెంగాల్, బీహార్, జార్ఖండ్, పంజాబ్ ఈ జాబితాలో ఉన్నాయి. 12 ఏండ్లు పైబడిన వారికి ఈ టీకా వేస్తారు.